Our Health

Archive for మే 3rd, 2013|Daily archive page

15. డయాబెటీసూ, కిడ్నీసూ, కాంప్లికేషన్సూ !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 3, 2013 at 10:29 సా.

15. డయాబె టీసూ,   కిడ్నీసూ, కాంప్లికేషన్సూ ! 

పైన ఉన్న చిత్రం , మన మూత్ర పిండాలలో ఉండే  అనేక లక్షల అతి సూక్ష్మ ” జల్లెడ ” లలో ఒకటి.  దీనిని శాస్త్రీయం గా  ”నెఫ్రాను ”  అని  పిలుస్తారు. ( ఒక్కో కిడ్నీ లో ఈ నెఫ్రాను లు , లేదా ” జల్లెడలు ” ఎనిమిది నుంచి పదిహేను లక్షల సంఖ్య లో ఉంటాయి !  ).

 
డయాబెటిస్ ,అంటే  మధుమేహం లో కిడ్నీస్ లో వచ్చే కాంప్లికేషన్ లు ఏమిటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ! 
కంట్రోలు లో లేని డయాబెటిస్, దేహం లో అన్ని భాగాలకూ హాని చేస్తుంది, క్రమేణా ! మరి మూత్రపిండాలకు ఎందుకు కన్సెషన్ ఇస్తుంది , ఆ ఎక్కువైన షుగరు ?!!!కిడ్నీ పరీక్షలు, ఒక క్రమ పధ్ధతి లో చేయించుకుంటూ ఉండడం అందువల్ల నే ఉత్తమం !
ముఖ్యం గా డయాబెటిస్ ఉన్న వారూ , కొత్తగా గుర్తించ బడిన వారూ  గుర్తు ఉంచుకోవలసినది:  మూత్ర పిండాలు , అంటే కిడ్నీలు తొలిదశలో డయాబెటిస్ వల్ల చూపించే మార్పులు ,  సరిఅయిన సమయం లో కనుక గుర్తించి , తగిన జాగ్రత్తలు తీసుకునేట్టయితే ,  ఆ మార్పులు  అక్కడే ఆగి , కిడ్నీ ఫెయిల్యూర్  నివారింప బడుతుంది ! తొలిదశలో ఏకారణం చేతనైనా ఆ మార్పులను గుర్తించక పొతే, లేదా గుర్తించిన మార్పులను అశ్రద్ధ చేస్తే , కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది ! కిడ్నీ ఫెయిల్యూర్ అంటే , కిడ్నీస్,  ” ఇక మావల్ల కాదు మానవా  ” అని  ” చేతులెత్తేయడమే” !
డయాబెటిస్ లో కిడ్నీ చెడి పోయే రిస్కు ఎట్లా ఎక్కువ అవుతుంది ? :
మనకందరికీ తెలుసు కిడ్నీసు  మన రక్తాన్ని శుద్ధి చేస్తాయని. ఎట్లాగంటే , మూత్రపిండాలలో ఉండే నిర్మాణాలు మన దేహం లో ఉండే అతి సున్నితమైనా , అతి సూక్ష్మ మైనా జల్లెడ ల లాగా పని చేసి , రక్తంలో , మన దేహానికి అవసరమయే పదార్ధాలను రక్తం లోనే ఉంచి , అనవసరమైనా లేదా హానికరమైన పదార్ధాలను మూత్రం ద్వారా బయటికి పంపుతాయి ! దీనినే మూత్ర విసర్జన అని అంటాము. మన రక్తం లో షుగరు ఎక్కువ అయినప్పుడు , మన కిడ్నీస్ ఎక్కువ గా అంటే కష్టపడి పనిచేసి ,రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ! విపరీతం గా ఈ క్రియలో కష్ట పడుతున్నమూత్రపిండాల లోని జల్లెడలు కొన్ని చోట్ల ” చిన్న చిన్న చిల్లులు ” పడిన విధం గా తయారవుతాయి !  దానితో , మన దేహానికి ఉపయోగకరమైన పదార్ధాలు కూడా దేహం లోకి పోకుండా , ఈ ” చిల్లులు పడ్డ జల్లెడల ” ద్వారా మూత్రం లో బయటకు వస్తాయి ! కిడ్నీస్ లో ఈ చిల్లులు పెద్దవీ , ఎక్కువ సంఖ్య లో ఏర్పడుతున్న కొద్దీ , ఎక్కువ ఉపయోగ కర పదార్ధాలు బయటకు విసర్జింప బడడం జరుగుతూ ఉంటుంది !దానితో మూత్రపిండాలు చెడి పోవడమే కాకుండా , మనిషి కూడా బలహీన పడడం జరుగుతుంది ! 
అంతే కాకుండా , కాల క్రమేణా , ఈ జల్లెడలు సరిగా పని చేయక పోవడం ఎక్కువ అవుతూ , దేహానికి ఉపయోగం లేని , హాని కర పదార్ధాలు, మూత్రం ద్వారా బయటకు వెళ్ళ కుండా , దేహం లోనే ఉండడం వల్ల , అంటే మన రక్తం లోనే ఉండి పోతూ ఉండడం వల్ల , ఆ విష పూరిత పదార్ధాలు చేసే హాని మన శరీరం లోనూ కనిపిస్తూ ఉంటుంది ! ఉదాహరణ కు : యూరియా , క్రియాటినిన్ , లాంటి పదార్ధాలు ! ఇవి రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే  అంత రక్తాన్ని కలుషితం చేస్తాయి !  రక్తం మన దేహం లో ప్రవహించని ప్రదేశం ఏదీ లేదు కదా ! దాని వల్ల మన మెదడు కూడా సరిగా పని చేయలేక పోవచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: