బాల బాలికలలో ఊబకాయం :

బాల బాలికలలో ఊబకాయం :

మన ఆహారం లో కాల్షియమ్ అవసరమా? :


అనీమియా కు చికిత్స ఏమిటి ?

రక్త హీనత ( అనీమియా ) ను కనుక్కోవడం ఎట్లా ?
https://www.youtube.com/watch?feature=player_detailpage&v=XqGmgWQKecs
రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? :


అనీమియా ( రక్త హీనత ) కీ ఇనుము కూ ఉన్న సంబంధం ఏమిటి ?:

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

( ” NO VIOLENCE AGAINST WOMEN ” )
కొన్ని కారణాలు చూద్దాం !
పితృస్వామ్యం : తర తరాలు గా సమాజం లో లోతు గా నాటుకున్న పితృ స్వామ్య భావాలు . స్త్రీ , చదువుకుని , బయటకు వెళ్లి , ఉద్యోగం చేస్తున్నప్పటికీ , , ప్రదానం గా పురుషుడి మాటే , అంటే తండ్రి మాటే పై చేయి కావాలనుకునే వాదం !
సజాతి వైరం : అంటే పురుషుడి తో పాటు గా , గర్భం దాల్చిన ‘ తల్లి ” కూడా , పుట్ట బోయేది ఆడ శిశువు అన్న విషయం తెలిసినప్పటి నుంచీ , ఆ విషయాన్ని అంగీకరించలేక పోవడం , ఆ ఆడ శిశువుకు గర్భం లోనో లేదా పుట్టిన తరువాతనో ఈ భూమి మీద నుంచి ” శాశ్వతం గా ఉద్వాసన ” చెప్పే మార్గాలు అన్వేషించడం , లేదా ఆ ప్రక్రియలో సఫలం అవడం !
ఆడపిల్ల తల్లి దండ్రులు , ఆడ శిశువు పుట్టగానే , పెరిగి పెద్దయి నాక ” కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి ” అందువల్ల తమ ఆర్ధిక పరిస్థితి విషమిస్తుంది అనే వాదన.
తల్లి దండ్రులు , మగ శిశువును విపరీతమైన గారాబం తో , శ్రద్ధ తో పెంచుతూ , అదే కుటుంబం లో ఉన్న ఆడ శిశువును అశ్రద్ధ చేయడం , ” క్రమ శిక్షణ ” తో పెంచడం వల్ల , మగ శిశువు లోనూ , పెరిగిన తరువాత పురుషుడి లోనూ పెరిగే అహంకార భావం , తాను స్త్రీకన్నా అధికం అనే భావాలు అలవడడం !
తల్లి దండ్రుల మధ్య హింస , ఒక ఇన్ఫెక్షన్ : చిన్న వయసు నుంచీ , ఆడ పిల్ల లైనా , మగ పిల్లలైనా , సునిశితమైన పరిశీలనా శక్తి , సామర్ధ్యాలు కలిగి ఉంటారు !
వారి కుటుంబం లోనూ , పరిసరాలలోనూ జరుగుతున్న సంఘటనలు , ఆనంద కరమైనవి కానీ , హింసా యుతమైనవి గానీ , వారి చిన్నారి హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి ! భర్త ఏ కారణం వల్ల నైనా , విపరీతమైన క్రోధం , తన ” ఇల్లాలి ” మీద చూపించి తరచూ ” చేయి ” చేసుకుంటూ ఉంటే , అది పరిశీలిస్తున్న చిన్నారుల మనస్సులో ” సామాన్యమైన సంఘటనలు ” అవుతాయి ! వారు పెరిగి పెద్ద వారై వారి వివాహ సంబంధాలు ఏర్పరుచు కున్నప్పుడు ,వాటిలో కూడా ” హింస ” సాధారణ విషయం అవుతుంది !
విసర్జన కన్నా మింగుడు మేలు : చాలా మంది అత్యాచార సంబంధాలతో ” వివాహ బంధం ” కోన సాగిస్తున్న స్త్రీలు , సామాన్యం గా , ఆ సంబంధం నుంచి విడి పోయే సమయం లో ఎదురయే భయాలూ , ఆందోళన లూ , తలుచుకుని , తరువాత తమకు ” సొంత వారి నుంచీ , ” సమాజం ” నుంచీ ఎదురయే సమస్యలూ ,భయాల ను భరించడం కన్నా , ” చెడ్డ ” మొగుడితో ” సంసారం ” మేలు ” అనుకునే అభద్రతా భావం !
పిల్లల భవిత మీద భయాలు : స్త్రీ తన వివాహ బంధం లో పరిస్థితులు విషమించి అది ” విష తుల్యం ” అయినా కూడా , నిరంతరం పెరుగుతున్న తన పిల్లల భవిత మీద భయాందోళన లు పెట్టుకుని , వారు ( తాను విడిపోతే ) పడే కష్టాలను తలుచుకుని , విడి పోయే నిర్ణయం మానుకుంటుంది , దానితో ,హింసను భరించడం ” అలవాటు ” చేసుకుంటుంది.
” సహన మూర్తి ” స్త్రీ ! : తర తరాలు గా సమాజం లో వివాహం చేసుకున్న స్త్రీ ని అనేక విధాలు గా వర్ణిస్తూ ఉంటారు అందులో ఒకటి ” ఆ ఇల్లాలు ఎంతో ఆదర్శ వంతురాలు ” భర్త తాగి తందనాలు వేస్తున్నా , ఎంతో సహనం తో పిల్లలు చదువుకుని పెద్ద వారై , వారి దోవల్లో వారు వెళ్లి , పెళ్ళిళ్ళు చేసుకునే వరకూ ,తానే అంతా బాధ్యత వహించి చేసింది ” ( స్త్రీ , కొవ్వత్తి అయి కొడి గడుతున్నా పరవాలేదు సమాజానికి ! ) అనే నల్లటి సంప్రదాయ ముసుగు వేసుకోవడం అలవాటవుతుంది ! ఆమె నిఘంటువులో అన్యాయానికి ఎదురు తిరగడం , ధిక్కరించడం అనే పదాలు ” సంప్రదాయం ” అనే నల్లటి సిరా తో శాశ్వతం గా చెరిపి వేసి ఉంటాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
స్త్రీ హింస – కారణాలు :

స్త్రీల మీదా, బాలికల మీదా హింస ఏ రకాలు గా ఉంటుంది ?:

మనం క్రితం టపాలలో ” మన ” భారత దేశం లో స్త్రీల మీద హింస గురించిన గణాంకాలు ( మచ్చు కి 2010 సంవత్సరం ) చూశాము కదా !
ఇప్పుడు మనం భారత స్త్రీల మీదా ఆడ శిశువుల మీదా ఈ హింస ఏ రకాలు గా ఉంటుందో చూద్దాం !
1. మన దేశం లో సర్వ సాధారణమైన హింస , స్త్రీల మీద జరగ దానికి ప్రధాన కారణం ” ఇచ్చిన కట్నం తో ( ” భర్త ” గానీ , భర్త తరుఫు వారు గానీ ) సంతృప్తి చెందక , ఆ కోపాలూ , అసంత్రుప్తులూ ఆ అమాయక స్త్రీ మీద నిరంతరం గా ఏదో రూపం లో చూపించడం జరుగుతుంది. అనుమాన పిశాచం తో వేధింప బడిన ” భర్త ” కానీ వారి తరుఫు వారు కానీ వివిధ తీవ్రత ల లో ” భార్య ” ను హింసించడం జరుగుతుంది. ఈ అనుమానపు పిశాచి ఆవహించిన ఒక ” భర్త ” చేసిన నిర్వాకం తండూరి మర్డర్ గా తీవ్ర సంచలనం కలిగించింది కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ లో !
( ఈ తండూరి హత్య వివరాలలోకి వెళితే , నయనా సహాని ఒక అందమైన స్త్రీ ( పైన ఉన్న ఫోటో చూడండి ) , ఆమె అనేక తీపి కలలు కంటూ , ఒక కాంగ్రెస్ నేత , ఎమ్మెల్యే కూడా అయిన సుషీల్ శర్మ ను వివాహమాడింది. నయనా సహానీ స్వతహా గా కాంగ్రెస్ కార్యకర్త . సుషీల్ శర్మ స్నేహితుడు మత్లూబ్ కరీం కూడా కాంగ్రెస్ కార్య కర్త. మత్లూబ్ కరీం కు నయనా సహానీ ముందే తెలిసి ఉండడం తో , వారి స్నేహం , సుషీల్ శర్మ లో అనుమాన పిశాచం దిన దినాభి వృద్ధి చెందడానికి దోహద పడ్డది. ఒకరోజు , ఇంటికి తిరిగి రాగానే , మద్యం సేవించి , ఫోనులో మాట్లాడుతూ ఉన్న నయనా సహానీ సుషీల్ శర్మ కంట బడ్డది ! దానితో విపరీతం గా కోపోద్రేకుడైన సుషీల్ శర్మ భార్య ఎవరికీ ఫోన్ చేసిందో నంబర్ చూసి కనుక్కున్నాడు. అది మత్లూబ్ కరీం దే ! వెంటనే సుషీల్ శర్మ తన సొంత భార్యను పిస్టల్ తో షూట్ చేసి చంపేశాడు ! తరువాత ( నయనా సహానీ శవాన్ని , తన స్నేహితుడైన కేశవ్ కుమార్ రెస్టారెంట్ ఒకటి ” బగియా ” అని ఉంది , అక్కడికి తీసుకు వెళ్ళాడు ! కేశవ్ కుమార్ ను ఉపాయం చెప్ప మన్న్నాడు శవాన్ని మాయం చేసే ఉపాయం ! తాను , తన భార్యను హత్య చేశాడనే నిప్పు లాంటి నిజాన్ని , తండూరీ నిప్పుల్లో కప్పేసి దాచేద్దామని అనుకున్నాడు ! అందుకోసం కేశవ్ కుమార్ సహాయం తో మరణించిన తన భార్య నయనా సహానీ శరీరాన్ని ముక్కలు ముక్కలు గా చేసి , తండూరి కుంపటి లో వేశాడు ! అనుమాన పిశాచి కాస్తా పూర్తిగా ఆవహించి సుషీల్ శర్మ ను ఒక మానవ పిశాచి గా, ఒక మానవ కసాయి గా మార్చేసింది ! నిజాన్ని నిప్పుల్లో కప్పేద్దామని అనుకున్న మానవ కసాయి ఎత్తు పారలేదు ! ఆ రాత్రి , కాపలా పోలీసులు ఇద్దరి కంట , ఎప్పుడూ తండూరీ పొగ గొట్టం లోనుంచి వచ్చే పొగ , ఇంకా ఎక్కువ గా , ( నర ) మాంస వాసనతో వస్తూ ఉంటే , అనుమానించి, రెస్టారెంట్ లో కి వెళ్ళారు. ఆ సమయం లో కేశవ్ కుమార్ తో సహా సుషీల్ శర్మ తప్పించుకుని పారి పోయాడు. ఒక వారం రోజుల తరువాత పోలీసులకు లొంగి పోయాడు. శవ పంచనామా ( పోస్ట్ మార్టం ) మొదటి సారి జరిపినప్పుడు దొరకని రెండు బుల్లెట్ లు , ( ? !! ) రెండో సారి ఒక ప్రొఫెసర్ జరిపిన పంచనామా లోనయనా సహానీ తల, మెడ భాగాల లోదొరికాయి ! . దానితో సుషీల్ కుమార్ కు కోర్టు వారు మరణ దండన విధించారు కనీసం పది ఏళ్ళు గా ఆ ” పిశాచ కుమార్ ” జైలు చువ్వలు లెక్క పెడుతూ ఉన్నాడు, సుప్రీం కోర్టు తీర్పు కోసం ! )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
రెండు వేళ్ళ ( అ ) న్యాయం !

ఢిల్లీ లో నివసిస్తున్న, లేదా సందర్శించిన నా స్నేహితు రాళ్ళు అందరికీ ఒక్కో కధ ఉంటుంది, అక్కడి పురుషుల గురించి చెప్పడానికి ! క్రిస్టీన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ఆన్త్రపాలజిస్ట్. ఆమె తన తల్లితో ఢిల్లీ లో కనాట్ ప్లేస్ లో వీధిలో నడుస్తుంది. ఆమె తన తల్లికి ( తల్లి మొదటి సారి ఢిల్లీ కి రావడం ) భారత దేశం ఎంత అత్భుతమైన దేశమో చెప్పాలని అనుకుంది. అంతలో అకస్మాత్తుగా ఒక పురుషుడు , క్రిస్టీన్ దగ్గరకు వచ్చి, ఆమె తల్లి ఎదురుగుండానే , ఆమె జననాంగ ప్రదేశాన్ని తన చేతితో తాకి, నవ్వుకుంటూ , జనం లో కలిసిపోయాడు. ఈ సంఘటనతో క్రిస్టీన్ విలపించింది. ఆమె ఇంకా బాధ పడ్డది, వేరే కారణానికి , భారత దేశం లో గ్రామాలలో ఉండే ,పేద వారూ , నిమ్న కులాల వారూ అయిన స్త్రీల పరిస్థితులు, ఇంకా ఎంత అధ్వాన్నం గా ఉంటాయో ఊహించుకుని !
ఢిల్లీ భారత దేశం లో మిగతా పట్టణాలతో పోలిస్తే , ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ ఉన్న అవినీతిమయ రాజకీయాలు , మనుషుల ను కూడా అవినీతి మయం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత దేశం లో ప్రతి వెయ్యి మంది పురుషులకూ కేవలం 866 మంది మాత్రమె స్త్రీలు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది తలి దండ్రులు, ఆడ శిశువులను, పుట్టగానే చంపేస్తున్నారు ! ఢిల్లీ లో మిగతా పట్టణాలు ( ముంబాయి, చెన్నై , కలకత్తా , బెంగళూరు , హైదరాబాద్ ) అన్నిటిలోనూ జరిగే మాన భంగాల మొత్తం కన్నా ఎక్కువ జరుగుతున్నాయి.
కేవలం, నిందితులకు తీవ్రమైన శిక్ష పడగానే , స్త్రీ హింస ఆగదు. భారత దేశ ప్రజలు, దేశం లో జరుగుతున్న కామ పరమైన అత్యాచారాల మీద సమూలం గా వారి ఆలోచనా ధోరణిని మార్చు కోవాలి ! అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు , పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసే విషయం లోనూ !
అంతే కాక , మాన భంగం చేయ బడ్డ స్త్రీ ని పరీక్షించే విధానం లో కూడా మార్పు ఉండాలి ! ప్రస్తుతం భారత దేశం లో ఈ పధ్ధతి చాలా లోప భూయిష్టం గా ఉంది. మాన భంగానికి గురైన స్త్రీ ని పరీక్షించే వైద్యుడు తన ఒక వేలిని ఆ స్త్రీ జననాంగం లో ప్రవేశ పెడతాడు. ఆ తరువాత , తన రెండు వేళ్ళను స్త్రీ జననాంగం లోకి అంటే వజైనా లోకి ప్రవేశ పెడతాడు. ఆ సమయం లో కనుక, ఆ స్త్రీ వజైనా వదులు గా ఉండి , ఒక వేలు కానీ , లేదా రెండు వేళ్ళు కానీ ( వజైనా ) లోపలి సులభం గా ప్రవేశింప చేయగలిగితే , ఆ వైద్యుడు , అప్పుడు ” వజైన వదులు గా ఉంది ” అని ధ్రువ పత్రం ( సర్టిఫికేట్ )ఇస్తాడు. ఇక్కడ జరుగుతున్నది, ఆ ( మాన భంగానికి గురైన ) స్త్రీ యొక్క శీలం , కేవలం , ఆమె వజైనా ఎంత వదులు గా ఉందో , దానిని బట్టి నిర్ధారించ బడుతుంది ! అంటే, పరీక్ష చేసిన ఆ వైద్యుడి రెండు వేళ్ళు కనుక ఒక స్త్రీ వజైనా లోకి ప్రవేశించ గలిగితే ,అతడు ఇచ్చే ధ్రువ పత్రం లో ” ఆ స్త్రీ కామ సంభోగానికి అప్పటికే అలవాటు పడి ఉంది ” అని ఇవ్వడం జరుగుతుంది. దీనిని సాకు గా చూపించి , ఆమె శీలం మీద సందేహాలు వెలిబుచ్చుతూ , అనేక మంది నిందితులు ” జారు కుంటున్నారు ”, చట్టం నుంచి !
ఈ ” రెండు వేళ్ళ ( అ )న్యాయం సాక్ష్యం గా పరిగణించ కూడదని భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం గా చెప్పినా , అనేక రాష్ట్రాలు ఇంకా , అత్యాచార నిందితుల విచారణ లో ఈ ” రెండు వేళ్ళ ( అ ) న్యాయ ” పద్ధతినే అనుసరిస్తున్నాయి ! అందు వల్ల నే మూడు వంతుల ( అత్యాచార ) కేసులలో, నిందితులు ” నిర్దోషులై ” సమాజం లో ” కలుస్తున్నారు ” !
చాలా మంది స్త్రీలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే జంకుతారు ! నా స్నేహితుడు ఒకడు భారత దేశం లో ఒక సినీ నిర్మాత. ఇటీవల జరిగిన సంఘటన ను అతను నాకు చెప్పాడు. అతని అకౌంటెంట్ , తన డబ్బు దుర్వినియోగం చేసి పరారయ్యాడు. అప్పుడు ఆ నిర్మాత పోలీసు లకు రిపోర్ట్ చేశాడు ఆ విషయం. అప్పుడు పోలీసులు , వెంటనే ఆ అకౌంటెంట్ ను పట్టుకో లేక పోయారు. వెంటనే వారు ఆ నిందితుని చెల్లెలు ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ నిర్మాత ఆ పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ” ప్రస్తుతం మీ అకౌంటెంట్ చెల్లెలు ను ఇక్కడ లాకప్ లో ఉంచాం. మీరు ఆమెను ” మీ ఇష్టం వచ్చినట్టు , ఏమైనా చేయ వచ్చు ” అని ,” భరోసా ” ఇచ్చాడు. అప్పుడు ఆ నిర్మాత ఆ ” చెల్లెలు ” పరిస్థితి కి విపరీతం గా ఆందోళన చెంది, తన సొంత మనుషులను పోలీస్ స్టేషన్ లో పగలూ రాత్రీ ” ఆమెకు రక్షణ గా కాపలా ఉంచాల్సి వచ్చింది !
ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆరుగురు ప్రస్తుత ఎమేల్సీ లు మానభంగ కేసులలో నిందితులు. ఇరువురు పార్లమెంట్ సభ్యులూ , ముప్పై ఆరుగురు రాష్ట్ర శాసన సభ సభ్యులూ , స్త్రీ హింసా నేరాలలో నిందితులు !
ఇటీవల గన్ కంట్రోల్ విషయం లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఇట్లా అన్నారు ” అమెరికన్ ప్రజల ప్రమేయం లేకుండా ” ఈ విషయం లో ఏమీ చేయ లేము ” అని. అదే విధం గా భారత దేశం లో కూడా స్త్రీ ల పై అత్యాచారాల విషయం లో , భారత దేశ ప్రజలు ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వక పొతే, ఈ పరిస్థితులలో ఏ విధమైన మార్పూ ఉండబోదు !
సుకేతు మెహతా , టైం తాజా వార పత్రిక నుంచి !