రక్త హీనత ( అనీమియా ) ను కనుక్కోవడం ఎట్లా ?
https://www.youtube.com/watch?feature=player_detailpage&v=XqGmgWQKecs
చిన్న పిల్లలలో :
బాల బాలికలలో అనీమియా ఈ క్రింది సూచనల వల్ల అనుమానించ వచ్చు.
1. కనీసం వారం లో మూడు రోజులైనా ఆకుకూరలు, పప్పు దినుసులు , తినక పోతూ ఉంటే , అంటే పోషకాహార లోపం వల్ల.
2. మాంసాహారులు కాక పొతే కూడా
3. మాంసాహారులు అయినా కూడా , ఎర్రటి మాంసం , కాలేయం , లాంటి మాంసాలు కాక తెల్లటి మాంసం , చికెన్ తినడం వల్ల కూడా రక్త హీనత కలగ వచ్చు.
4. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు ( కొందరు గ్రామీణ బాల బాలికలు ఇప్పటికీ , వారి మలం లో పురుగులను చూసి , తల్లి దండ్రులకు చెబుతూ ఉంటారు )
యుక్త వయసు వచ్చిన ( అమ్మాయి లలో ) వారిలో :
వనితలలో కూడా ఋతుస్రావం మొదలైనప్పటి నుంచీ , రక్త హీనత కు అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి వారు ఇనుము , మాంస క్రుత్తులు ( అంటే ప్రోటీనులు ) లోపించిన ఆహారమే తీసుకుంటూ ఉన్నప్పడు. గమనించ వలసిన విషయం ఏమిటంటే , అనీమియా లక్షణాలు , క్రమేణా అంటే రోజు రోజు కూ పెరుగుతూ ఉంటాయి. అంటే మొదటి దశలలో హీమోగ్లోబిన్ పదమూడు ఉండవలసినది , పదకొండు అయినప్పుడు లక్షణాలు అంత తీవ్రం గా ఉండవు. కానీ ఇనుము లోపం సరి చేయకుండా , అంటే ఆహారం లో ఇనుము ఎక్కువ గా ఉండే , ఆకు కూరలూ , కూరగాయలూ తీసుకోనప్పుడు , అనీమియా తీవ్రత హెచ్చి , హీమోగ్లోబిన్ కాస్తా ఏడూ ఎనిమిది కి తగ్గ వచ్చు. తగ్గుతున్న కొద్దీ రక్తం అంటే రక్తం లో రక్త కణాలు , శరీరానికి అవసరమైనంత ప్రాణ వాయువు ను సరఫరా చేయలేవు. అంటే మన శరీరం లో అను నిత్యం, ప్రతి జీవ కణాని కీ కావలసిన ప్రాణవాయువు అందక , కణాలు నీరస పడతాయి. మానవ శరీరం అంతా కణాల సముదాయమే కదా ! అందువల్ల మన శరీరం కూడా నీరస పడుతుంది.
పైన ఉన్న వీడియో చూడండి , క్రింద ఉన్న చిత్రం లో హీమోగ్లోబిన్ ఎట్లా మన శరీరానికి ఉపయోగ పడుతుందో కూడా చూడండి !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !