కృత్రిమ తీపి రసాయనాలు ( ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ ) డయాబెటిస్ ను ఎందుకు ఎక్కువ చేస్తాయి ?
నడి వయసులో వచ్చే టైప్ టూ ( type 2 diabetes ) మధుమేహ వ్యాధి ఈ రోజుల్లో ప్రపంచం లోని అనేక దేశాలలో , అతి త్వరగా , ఎక్కువ మంది లో కనిపిస్తూ , ఆ వ్యాధి గ్రస్తులకే కాకుండా , ఆ యా దేశాల ప్రభుత్వాలకు కూడా ఒక తీవ్రమైన సమస్య గా పరిణమించింది !
సర్వ సాధారణం గా, ఈ రకమైన నడి వయసు లో వచ్చే డయాబెటిస్ ఉన్న వారికి , ఇప్పటి వరకూ డాక్టర్లు , షుగర్ అంటే చక్కెర ను నేరుగా , వారు తినే ఆహారం లో కానీ , తాగే పానీయాలలో కానీ , అసలు వేసుకోక పోతేనే ఉత్తమం అని సలహా ఇస్తారు !
అంతే కాకుండా , వారికి ,చక్కెర కు బదులు గా కృత్రిమం గా లభ్యమయే , శాకరిన్ , లేదా సుక్రాలేజ్ అనే ‘ షుగర్ ట్యా బ్లెట్ ‘ లు నిరభ్యంతరం గా తీసుకోవచ్చని శెలవిస్తారు !
శాకరిన్ లేదా షుగర్ ట్యా బ్లెట్ కనుక్కున్న కొత్తల్లో , అది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఒక ‘ వరం ‘ లా భావించ బడింది ! ఎందుకంటే , ఈ రసాయనం లో కేవలం తీపి కలిగించే లక్షణాలే ఉన్నాయి కానీ , క్యాలరీలు ఏవీ ఉండవు ! అంటే , రక్తం లో చక్కర శాతం ఎక్కువ అవదు , ఈ ట్యా బ్లెట్ లు చక్కెర కు బదులు గా ఆహారం లోనూ , పానీయాల లోనూ తీసుకుంటే ! అందువల్లనే , ఈ షుగర్ ట్యా బ్లెట్ లు ప్రపంచం లో అనేక దేశాలలో , టన్నుల కొద్దీ అమ్మ బడుతూంది ! కేవలం మధు మెహ వ్యాధి గ్రస్తులే కాకుండా , ఊబకాయం , అంటే ఒబీసిటీ సమస్య ఉన్న వారు, లేదా సన్న బడాలనుకునే వారూ కూడా విస్తృతం గా ఈ షుగర్ ట్యా బ్లెట్ లను వాడుతున్నారు , రోజూ !
వారందరూ ఇప్పుడు ఆశ్చర్య పోవడమే కాకుండా , ఈ విషయం లో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం కూడా తాజా పరిశోధన ఫలితాల వల్ల , తప్పని సరి అవుతుంది ! ఆ వివరాలు చూద్దాం !
చేంతాడంత చదవడం ఎందుకు అసలు విషయం చెప్పడానికి ‘ అనుకునే వారికి ‘ షుగర్ ట్యా బ్లెట్ లు ‘ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇక ముందు నుంచి నిషేధం ‘ అనే వార్నింగ్ గుర్తు ఉంచుకుని ఆచరిస్తే , వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది !
కారణం : షుగర్ ట్యా బ్లెట్ లు లేదా కృత్రిమ తీపి రసాయనాలు , డయాబెటిస్ ను ఎక్కువ చేస్తాయి !
పరిశోధనా స్థలం : ఇజ్రాయల్ లోని వీజ్ మన్ విద్యాలయం.
ఆ పరిశోధన ఎందువల్ల మొదలు పెట్టడం జరిగింది ? : ఆశ్చర్య కరం గా , ఈ తీపి రసాయనాలు ( షుగర్ ట్యా బ్లెట్ లు ) వాడుతున్న అనేకమంది లో డయాబెటిస్ ఏమాత్రమూ కంట్రోలు లో లేక పోగా , వారి ఊబకాయం కూడా తగ్గక పోవడం జరిగింది , అందుకని శాస్త్రజ్ఞులు కారణాలు వెదకడం మొదలు పెట్టారు !
పరిశోధన ఎట్లా జరిగింది ? : ముందుగా వారు ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఎలుకలకు , ఈ తీపి రసాయనాలు ఉన్న ఆహారం , పానీయాలు ఇచ్చారు ! ఇంకో రకం ఎలుకలకు షుగర్ ట్యా బ్లెట్ లు లేకుండా , సహజమైన తీపి అంటే చక్కెర వేసిన ఆహారమే ఇచ్చారు !తీపి ( కృత్రిమ ) రసాయనాలు ఉన్న ఆహారం తిన్న ఎలుకలకు డయాబెటిస్ వచ్చింది ! దీనికి కారణాలు వెతుకుతుంటే , శాస్త్రజ్ఞులకు ఒక ఆశ్చర్య కరమైన విషయం తెలిసింది ! మన దేహం లో , ప్రత్యేకించి మన జీర్ణ వ్యవస్థ లో ఉండే అనేక లక్షల బ్యాక్టీరియా క్రిములు , నేరస్తుల లాగా , తీసుకున్న తీపి రసాయనాల తో కుమ్మక్కయి , గ్లూకోజు ను తట్టుకో లేకుండా చేస్తున్నాయి అని ! అంటే తీపి రసాయనాలు లేదా షుగర్ ట్యా బ్లెట్ లు తీసుకుంటే , ఆ తీసుకున్న వారి రక్తం లో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది ! ఆ పరిస్థితి స్థిరం గా ఉంటే , దానినే డయాబెటిస్ అని అంటాము !
మరి ఈ బ్యాక్టీరియా నే నేరస్తులు గా ఎట్లా నిర్ణయించారు ?
డయాబెటిస్ వచ్చిన ఎలుకల లోనుంచి బ్యాక్టీరియా ను తీసుకుని , డయాబెటిస్ లేని ( ఆరోగ్య వంతమైన ) ఎలుకలలోకి ప్రవేశ పెడితే , ఆ ఎలుకలకు కూడా డయాబెటిస్ వచ్చింది ! అందువల్ల కృత్రిమ తీపి రసాయనాలకూ , ఈ బ్యాక్టీరియా లకూ మధ్య ఉన్న లింకు స్పష్టమయింది !
మనం నేర్చుకోవలసినది : కృత్రిమ తీపి పదార్ధాలు అంటే ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ కానీ , లేదా ఆ కృత్రిమ తీపి పదార్ధాలు అంటే ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ ఉన్న ఏ ఆహార పదార్ధాలూ , పానీయాలూ కానీ , తినడమూ , తాగడమూ , కేవలం ఆ యా కంపెనీ లు సొమ్ము చేసుకోవడానికే చేయాలి కానీ మన ఆరోగ్యం కోసం కాదు అని !
అవి తీసుకుంటే , మన ఆరోగ్యం బాగా ఉండడం మాట దేవుడెరుగు , అనారోగ్యం ( డయాబెటిస్ ) కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! అంతే కాకుండా , ఇప్పటికే డయాబెటిస్ వచ్చి ఉన్న వారికి కూడా , ఆ వ్యాధి కంట్రోలు తప్పి పోవడం జరుగుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !