Our Health

ప్రాణం విలువ లో తేడాలు.

In మన ఆరోగ్యం., Our Health on జూన్ 22, 2014 at 1:28 సా.

ప్రాణం విలువ లో తేడాలు. 

దేశం: జర్మనీ. 
ప్రాంతం : ఆల్ప్స్ పర్వత శ్రేణి. 
సమయం : జూన్ 8,  2014. 
ప్రమాదం జరిగింది:  ఒక్కడికి. 
పాల్గొన్న సహాయ సిబ్బంది : 728 మంది. వివిధ దేశాలకు చెందిన వారు (  జర్మనీ, స్విట్జర్లాండ్ ,  ఆస్ట్రియా , ఇటలీ , క్రొయేషియా ) పైన ఉన్న చిత్రం మీద క్లిక్ చేసి, వీడియో చూడండి !  
జొహాన్ వెస్ట్ హాజర్ అనే జర్మనీ కు చెందిన  శాస్త్రజ్ఞుడు, గుహలను పరిశీలించడం లో అపారమైన అనుభవం ఉన్న వాడు. యూరప్ లో ఎత్తైన పర్వత శ్రేణి ‘ ఆల్ప్స్ ‘ అనే పర్వత శ్రేణి , అంటే హిమాలయాల లో ఉన్న పర్వత శ్రేణి లాగా ! తన ఇరువురు సహచరులతో , ఆస్ట్రియా దేశం  సరిహద్దులో ఉన్న  రీ సెన్ డింగ్ గుహలను పరిశీలించడానికి బయలు దేరాడు, జూన్ ఎనిమిదవ తారీఖున . గుహల లోకి దిగుతూ , ప్రమాద వశాత్తూ , ఒక బండ రాయి విరగడం తో , వెయ్యి మీటర్ల దిగువన,  అంటే ఒక కిలోమీటరు లోతులో  పడి  పోయాడు. తన సహచరులిద్దరూ , ఆ ప్రమాదాన్ని తప్పించుకుని, అత్యవసర సిబ్బంది ని  అప్రమత్తం చేశారు. 
రీ సెన్ డింగ్ గుహలు ఎంతో లోతైనవే  కాకుండా , చాలా కఠిన మైన బండ రాళ్ళతో నిర్మితమైనవి. దీనితో   జొహాన్ ను రక్షించడానికి , సహాయ సిబ్బంది అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. చాలా చోట్ల ఈ గుహ, కేవలం  చిన్న చిన్న సందులు గానే కనిపిస్తుంది ! ఆ సందులను వెడల్పు చేయాడానికి ఏదైనా యంత్రాన్ని ఉపయోగించి , అంటే ఆ ఇరుకు గా ఉన్న రాళ్ళను తొలుచు దామనుకున్నా , ఆ సమయం లో విరిగి పడే రాళ్ళూ , రప్పలూ , వెయ్యి మీటర్ల దిగువున పడి ఉన్న జొహాన్ ను ఠ పీ మని  చంపేయ గలవు ! ఇన్ని ప్రమాదాలకు  నిలయమైన ఆ గుహ నుంచి ,  జొహాన్ కోసం వెదకడం అనవసరమనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు కొందరు , ఆ ప్రయత్నం ఆరంభం లో ! కానీ , ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకుని , తదేక దీక్ష తో ,  728 మంది సిబ్బంది కలిసి , పన్నెండు రోజులు శ్రమించి , గుహలో ఒక కిలోమీటర్ లోతు లో పడి ఉన్న జొహాన్ ను ప్రాణాలతో , పైకి తీసుకు వచ్చారు ! జొహాన్ వెంటే ఇద్దరు డాక్టర్లు కూడా పైకి వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్ళారు , పరీక్షలూ , చికిత్స కోసం ! 
సమయం : జూన్ 20, 2014. జొహాన్ ఆస్పత్రి లో కోలుకుంటున్నాడు ! విశేషం ఏమిటంటే , జొహాన్ , 1995 లో ఇదే గుహను కనుక్కున్న వారిలో ఒకడు ! 
దేశం: ఇండియా . 
ప్రాంతం : హిమాచల్ ప్రదేశ్. 
బియాస్ నది. 
సమయం:  June 08. 2014. 
ప్రమాదం జరిగింది : 24 మంది ( ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  ) ఇంజనీరింగ్ విద్యార్ధులకు. 
కారణం :  బాధ్యతా రహితం గా , కనీస హెచ్చరికలు చేయకుండా , ఏ రకమైన ముందు జాగ్రత్తలూ తీసుకోకుండా , బియాస్ నది  బ్యారేజీ తలుపులు తెరిచి , విద్యార్ధులందరూ కొట్టుకు పోవడానికి కారకులైన సిబ్బంది !  ఈ విషయం ఖచ్చితం గా తెలిపింది , ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్ట్ లో !   ఈనాడు లో వార్త ( 21.06. 2014) క్లిప్పింగ్  చూడండి.  
ఒక్కో విద్యార్ధి ప్రాణానికీ,  కనీసం అయిదు కోట్ల రూపాయల నష్ట పరిహారం కోసం , అందరు తల్లి దండ్రులూ కలిసి , సుప్రీం కోర్టు లో కేసు వేయాలి , కనీసం, భవిష్యత్తు లో,  ఇతర ప్రాణాల  రక్షణ  కోసమైనా ! 
Beas tragedy. Beas tragedy b.
( మరణించిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తో  ) 
  1. మన దేశం లో దేనికీ విలువలేదు, ఒక్క సినిమాకి,రాజకీయానికి తప్ప. సామాన్యుల ప్రాణాలంటే అసలు లెక్కే లేదు. ఇంతకాలం వెతుకుతున్నారంటేనే గొప్ప విషయం. హై కోర్ట్ సుమోటో కేస్ తీసుకోకపోతే ఇంతే సంగతులు.మారిన ప్రభుత్వపు చొరవ కూడా శవాలు వెతకడానికి కారణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: